అను స్క్రిప్ట్ మేనేజర్ (6,7 వెర్షన్లు) ఉపయోగించి తెలుగులో టైప్ చేసిన, టెక్స్ట్ ఫార్మాటులో ఉన్న ఫైళ్ళను యూనీకోడులోకి మార్చే ఆన్లైన్ కన్వర్టర్ రూపొందించబడింది.
ఈ ఉపకరణాన్ని Unigateway లోని ముఖ్య ఫైళ్లను ఉపయోగించుకుంటూ, అను 7 కి కూడా సపోర్ట్ జతచేసి తయారుచేసాను. Unigateway అనేది ఫైర్ఫాక్స్ పద్మ పొడిగింతను phpలో రాసినది. దీనిని http://uni.medhas.org సైటులో హోస్ట్ చేసారు. దానిలో వివిధ ఫాంట్లలో టైప్ చేసిన పత్రాలను యూనీకోడులోకి మార్చడానికి ఒక ఉపకరణం ఉంది కానీ అను 6 కి మాత్రమే సపోర్టు ఉంది.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ పంచాంగం ఖగోళానికి సంభందించిన వివిధ గణిత సూత్రాల ఆధారంగా పనిచేస్తుంది. మీ విహరిణిలో ఉన్న టైమ్జోన్ని గ్రహించి మీ ప్రాంతానికి తగిన సమయాన్నిబట్టి పంచాంగాన్ని చూపిస్తుంది. దీనిలో చూపించే సమయాల్లో కొన్ని నిమిషాలు అటూ ఇటూ ఉండవచ్చును. ముందు ముందు మరింత సమాచారం ఈ పంచాంగంలో చేర్చడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి మీరు ఈ జావాస్క్రిప్ట్ కోడుని తీసుకుంటే తర్వాత జతచేసే ఫీచర్ల కోసం మీరు కోడుని తాజీకరించుకోనక్కర్లేదు. ఎప్పుడు జతచేసిన ఫీచర్ అప్పుడే మీ సైటు/బ్లాగులో దర్శనమిస్తుంది.
ఇక ముందుముందు పండుగలు, పర్వదినాలు లాంటివి జత చేస్తాను. ఈ పంచాంగం విడ్జెట్ను ఎవరైనా ఏ బ్లాగులోనైనా వెబ్సైటులోనయినా ఉంచవచ్చు.
ముందుగా మీరు http://plugins.harivillu.org/panchangam సైటుకి వెళ్లి అక్కడ ఉన్న వివిధ ఎంపికల ద్వారా మీకు ఇష్టమైనట్టు పంచాంగాన్ని తయారుచేసుకోండి. తర్వాత ఈ క్రింది కనిపిస్తున్న విద్దంగా కోడుని కాపీ చేసుకోండి.

బ్లాగరు ఖాతాలోకి ప్రవేశించిన తర్వాత పంచాంగం ఉంచవలసిన బ్లాగు తాలూకూ లేఅవుట్లోకి వెళ్ళండి. లేఅవుట్లో కుడివైపున కనిపించే గాడ్జెట్ను చేర్చు అన్న లంకెను నొక్కితే మీకు ఈ క్రింది విదంగా ఒక విండో కనిపిస్తుంది. అందులో ఉన్న HTML/Javascript ని “+” ని నొక్కి జత చేయండి.

ఆపై వచ్చే విండోలో క్రింది కనిపించే విధంగా కోడుని అతికించి సేవ్ చెయ్యండి. ఆపై లేఅవుట్ని సేవ్ చేయండి.

వర్డ్ప్రెస్లోకి లాగిన్ అయ్యాకా ఎడమ వైపున ఉన్న Appearance లో ఉన్న Widgetని క్లిక్ చెయ్యండి. తర్వాత వచ్చే పేజీలో ఉన్న Available Widgets లోంచి Text విడ్జెట్ని ఎంచుకోండి

Text విడ్జెట్ని Add చేసాకా అది కుడి వైపుకు కలపబడుతుంది. అక్కడ నుండి దాన్ని Edit చెయ్యవచ్చు. ఈ క్రింది కనిపించే విదంగా మీరు పంచాంగం కోడుని కలపవచ్చు. ఆపై Save Changes నొక్కితే సరి!

మీకు HTML ఒంటబట్టినట్టయితే మీ వెబ్పేజీలో ఎక్కడ కావాలంటే అక్కడ మీరు పంచాంగాన్ని ఉంచవచ్చు. మీరు పైన పొందిన పంచాంగం కోడుని మీకిష్టమైన చోట ఉంచండి చాలు!.
మునుముందు జతచేసే తాజాకరణలను మీకు తెలియజేయడానికి ఈ క్రింది కనిపిస్తున్నట్టు http://plugins.harivillu.org/panchangam లో ఉన్న ఫారంను నింపి సమర్పించండి.

ఈ రోజు హైదరాబాదులో జరిగిన పుస్తక ప్రదర్శనలో e-తెలుగు ఏర్పాటుచేసిన స్టాలులో మధ్యాహ్నం నుండి నేను కూడా ఉన్నాను. మేము కరపత్రాలు పంచాము. చాలా మంది ఆశక్తి చూపించారు. వాళ్లలో కొందరు కంప్యూటర్లో తెలుగు కనిపించాలంటే డబ్బిచ్చి ఏదన్నా సాఫ్ట్వేర్ కొనుక్కోవాలేమో, దానికోసమే మేము అక్కడ ఉన్నామేమో అనే అపోహలో ఉన్నారు. మేము వాళ్ల సందేహాలు తీరుస్తూవచ్చాం. తెలుగు బ్లాగరులు కూడా ఎక్కువే వచ్చారు (అంటే నా దృష్టిలో ప్రతినెలా సమావేశానికి వచ్చేవారికన్నా ఎక్కువ అని). సాయంత్రం ఆరు గంటలు దాటాకా e-తెలుగు సంఘం ప్రదర్శన ప్రారంభమయ్యింది. ప్రదర్శనలో భాగంగా కంప్యూటర్లో తెలుగు ఎనేబుల్ చెయ్యడం ఎలా? బ్లాగంటే ఏమిటీ? బ్లాగుని ఎలా సృష్టించుకోవాలి? ప్రస్తుతం ఉన్న కొన్ని బ్లాగుల వివరాలు, వికీపీడియా గురించి, ఈమాట, పొద్దు లాంటి వెబ్ పత్రికల గురించి, వివిధ వెబ్సైట్ల స్థానికీకరణ గురించి చెప్పి ఆ విషయాలనే వీడియో రూపంలో చూపించడం జరిగింది. ఒకటో రెండో టీవీ ఛానళ్ల వాళ్ళు కార్యక్రమాన్ని వీడియో తీసుకున్నారు. పత్రికల వాళ్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పనుల హడావిడిలో పడి అక్కడకు వచ్చిన మిగిలిన బ్లాగరులతో మాట్లాడటం కుదరలేదు. ముఖ్యంగా అక్కడకు వచ్చిన కొందరు మహిళా బ్లాగరుల పేర్లు తెలియదు
. అందుకే ఈ జాబులో ఎవరి పేరూ ప్రస్తావించకుండా కేవలం బ్లాగర్లు అని సంభోదిస్తున్నాను. ఎవరూ ఏమీ అనుకోకండేం. ఇక్కడ నా అనుభవాలను, అనుభూతులను ఒక బ్లాగరుగా రాసున్నానంతే. మరిన్ని వివరాలకు త్వరలో e-తెలుగు నుండి వచ్చే టపాలో చూడండి.
మరో రెండు ముఖ్య విశయాలు:
* నిన్ననే రావు వేమూరి గారి బ్లాగులో తెలుగు ఎందుకు? అన్న టపాలో “మనకి నిజానికి కావలసినది ప్రాచీన హోదా కాదు – ఆధునిక హోదా కావాలి” అన్న మరువమ్ము*ని చదివాను. e-తెలుగు ప్రదర్శనలో మాట్లాడుతూ ఈ మాటని కూడా మనవాళ్లు ప్రస్తావించారు. కార్యక్రమం అయ్య్యాక స్టాలు వద్దకి సినీరచయిత జే.కే భారవి గారు వచ్చి “ఆధునిక హోదా రావాలి అని మీరన్న మాట అదిరింది” అని సంతోషిస్తూ వెళ్ళారు.
* ప్రముఖ ఇంద్రజాలకులు, మానసిక వైద్య నిపుణులు బీవీ పట్టాభిరాం గారు వచ్చారు. ఆయనకి e-తెలుగు గురించి, ఇంటర్నెట్లో తెలుగు గురించి తోటి బ్లాగరులు వివరించారు.
కొసమెరుపు:స్టాలుకి వచ్చిన ఒకాయనకి కరపత్రం ఇచ్చాను. ఆయన కూడా ఉన్న ( ఆరు సంవత్సరాలు ఉండొచ్చు ) పిల్లాడికి కూడా ఇచ్చాను. ఆ పిల్లాడు పత్రంలోని తెలుగుని చూసి “డాడీ నాకు తమిళ్ రాదు” అంటూ తన తండ్రి వంక అయోయంగా చూసాడు. నాకప్పుడు తలని గోడకేసి “పేడ పేడ” అంటూ కొట్టుకోవాలనిపించింది.
మరువమ్ము: ఎవరన్నా ఏదన్నా ఒకమాట చెప్పారనుకోండి; ఆ మాట మనకి చాలా నచ్చిందనుకోండి; ఆకట్టుకున్నదనుకోండి; బాగా గుర్తుండేలా ఉందనుకోండి, ఆ మాటకి మరువమ్ము అని నా సొంత ప్రయోగం.

వేదిక మీద e-తెలుగు సభ్యులు/బ్లాగరులు

e-తెలుగు స్టాలు ముందర సభ్యులు/బ్లాగర్లు

e-తెలుగు స్టాలులో సభ్యులు/బ్లాగర్లు
వరంగల్లో జరిగిన రెండు దుర్ఘటనలకు బ్లాగులలో చాలా మంది బాగానే స్పందించారు.
నట్టడవులు నడివీధికి నడిచొస్తే ఇంతే!
ఇదా పరిష్కారం!!
మీడియా చేయించిన హత్యలు
You oughtta do it స్వప్నికా!
అసలు నేరస్తులు
ఆటవిక న్యాయం అమలైంది!
ఇదేనా న్యాయం అంటే??
ఎన్కౌంటర్
చంద్రునికో నూలుపోగు అనుకోండి… తిలాపాపం తలాపిడికెడు అనుకోండి… ఇదిగో…
నేను టీవీ చూడడం తక్కువ. పేపరైనా ఏదన్నా బుద్దిపుట్టినప్పుడు మాత్రమే ఆన్లైనో తిరగేస్తుంటాను. నేను ఉదయం ఆఫీసుకెళ్ళినప్పుడు అక్కడ ఎవరన్నా ఏదన్నా చర్చించుకుంటే తప్ప నాకు నూతి బయట ఏం జరిగిందో తెలియదు. ఈ విషయమూ అలాగే తెలిసింది. ఆఫీసులో చేస్తున్న పని మీద విసుగు కలిగి దగ్గర్లో ఉన్న సహోద్యోగి దగ్గరకు వెళ్ళినప్పుడు గానీ నాకు ఈ యాసిడ్ వార్త తెలియలేదు. ఇలాంటప్పుడు మామూలుగానే మగాడిలా కాకుండా మనిషిలా భాదపడ్డాను. ఆ వ్యక్తి మీద చాలా కోపం వచ్చింది. వేరే దేశాల్లో అమలవుతున్నట్టు కన్నుకి కన్ను పన్నుకి పన్ను శిక్ష వేసెయ్యాలి వీళ్ళకి అన్నంత కోపంవచ్చింది. ఆ పక్కనే ఒక అమ్మాయి కూర్చుంటుంది. ఆ విషయమై జరిగిన చర్చలో వీళ్ళని చంపేస్తే గానీ ఇలా చేసేవాళ్ళకు బుద్దిరాదు అన్న మాటలు వినిపించాయి. కానీ ఒకరు ఇలా మారడానికి వారు వ్యక్తిగతంగా సగం కారణమైతే వారి తల్లిదండ్రులు, స్నేహితులూ మిగిలిన సగం కారణమవుతారనే భావన ఎప్పటి నుండో నాలో మెదులుతూ ఉంది.
బ్లాగర్ల దినోత్సవం రోజు మధ్యాహ్నం సమావేశానికి వెళ్ళేముందు ఒకసారి కూడలిని తెరచి చూసాను. అక్కడ మొదట కనిపించిన చదువరి గారి జాబు చదివితే గానీ రెండో దుర్ఘటన విషయం తెలియలేదు. అప్పుడే ఈనాడు పత్రిక తెరిచి చదివాను అసలు విషయం. ఇంతకు ముందు ఆ వ్యక్తి మీద కలిగిన కోపం ఇప్పుడు పోలీసుల మీద కలిగింది. ఆ రాత్రి తీరికగా కూర్చుని మిగిలిన బ్లాగరులు రాసిన జాబులను చదివాను. ఇక్కడ ఆ అమ్మాయి అబ్బాయిల వ్యక్తిగత విషయాలు కాదు మనం ఆలోచించాల్సింది. నువ్వు మనిషిగా ఎలా స్పందిస్తున్నావు. తల్లిగానో, తండ్రిగానో, అన్నగానో, అక్కగానో నీ బాద్యత ఏమిటి అని నిన్ను నువ్వు ప్రశ్నించుకునే సమయమిది. మనం ఆలోచించాల్సింది ఏది మంచి ఏది చెడు అని. అంతేగానీ మనలోని అక్కసుని వెల్లగక్కుకునే సమయం కాదిది. ఇగోలని ఇగో అని చూపించే సమయం కాదిది.
నాలో పేరుకుపోయిన బద్ధకాన్ని విదిలించి మరీ ఈ జాబు రాయడానికి రెండు ముఖ్యకారణాలున్నాయి.
1) ఈ ఆదివారం ఈ విషయం మీద పేపర్లో వార్త చదువుతున్నప్పుడు “శనివారం వరంగల్లో ఎస్పీ సజ్జనార్కు విద్యార్థినుల అభినందనలు” అన్న ఛాయాచిత్రం
2) విశాఖ డైలీ బ్లాగులో ఒకాయన రాసిన వ్యాఖ్య మరీ బాదపెట్టింది.
నేను ఆ దాడి చేసిన వాళ్ళను సమర్థించను. అలా అని పోలీసుల ఎన్కౌంటర్నూ సమర్థించలేను! చదువరిగారన్నట్టు ఇలాంటి సంఘటనల వల్లనైనా కనీసం రిహార్సల్స్ చేసి మరీ ఇలాంటి అకృత్యాలకు పాల్పడేవాళ్ళు ఆలోచించగలిగితే/భయపడితే నా తమ్ముడో, చెల్లో, కూతురో, కొడుకో, స్నేహితుడో, స్నేహితురాలో ఇలా మన బ్లాగుల్లో చర్చనీయాంశానికి పావులుగా కాకుండా ఉండగలరు.